Burglars Attack On MLA”s House : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి దొంగలు ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉండే నవోదయ కాలనీలోని రెయిన్బో విల్లాస్లో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు నివసిస్తున్నారు.
ఈనెల 3వ తేదీ రాత్రి దొంగలు కాలనీలో పలు ఇళ్లలో దొంగతనానినికి యత్నించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్… హైడ్రాలిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎండీ. వెంకటరెడ్డి విల్లాల్లో దొంగతనానికి దొంగలు ప్రయత్నించారు. అలికిడి అయ్యేసరికి వాచ్మెన్ గట్టిగా కేకలు వేయటంతో దొంగలు పరారయ్యారు.
Also Read : Cheating : తక్కువ ధరకు బంగారం…మాజీ మంత్రి అల్లుడితో సహా…రూ.6.5 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు
పలుగులుతో తలుపులు పగల గొట్టి దొంగతనం చేయటానికి… దొంగలు ప్రయత్నించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనను బట్టి తెలుస్తోంది. కాగా ఈ దోపిడీలో బంగారు ఆభరణాలు, నగదు కానీ ఏమి పోలేదని పోలీసులు తెలిపారు. ఇంతవరకు ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. కాగా…. ఇటీవల విజయవాడ లోని రెండు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్ ముఠానే ఈ దోపిడీ కి పాల్పడి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు.