శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురువ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 915.17 గ్రాముల బంగారం లభించింది.
ఈ బంగారానికి సంబంధించి వారి వద్ద ఎటువంటి రసీదులు లేకపోవటంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. బంగారం విలువ 35లక్షల 50 వేల858 రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు.
Hyderabad: Air Intelligence Unit of Customs, arrested three people and seized 915.17 gm gold worth Rs 35,50,858 at Rajiv Gandhi International Airport, yesterday. A case has been registered. #Telangana pic.twitter.com/eh0fzijfZ2
— ANI (@ANI) October 20, 2019