దిశా నిందితుల మృతదేహాలు..50 శాతం డీ కంపోజ్

  • Publish Date - December 21, 2019 / 05:51 AM IST

చటాన్ పల్లి ఎన్ కౌంటర్‌లో దిశ నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంపై సందిగ్ధత నెలకొంటోంది. కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, డిసెంబర్ 21వ తేదీ శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు గాంధీ ఆస్పత్రి చీఫ్ సూపరింటెండెంట్ శ్రవణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు పలు ప్రశ్నలను సంధించింది.

మృతదేహాలను ఎలా భద్రపర్చారు… ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయంపై హైకోర్టు.. గాంధీ చీఫ్ సూపరింటెండెంట్‍‌ను ప్రశ్నించింది. -2 నుంచి 4-డిగ్రీల ఉష్ణోగ్రతలో నాలుగు మృతదేహాలను భద్రపర్చామని… మృతదేహాలు 50 శాతం డీ కంపోజ్ అయ్యాయని శ్రవణ్ కోర్టుకు వివరించారు. దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపర్చే సౌకర్యాలు ఉన్నాయా అని కోర్టు గాంధీ ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్‌ను ప్రశ్నించింది. తనకు ఆ విషయం తెలియదని ఆయన కోర్టుకు తెలిపారు. మరో వారం రోజులు ఉంటే..వంద శాతం నాలుగు మృతదేహాలు కుళ్లిపోయే పరిస్థితి నెలకొందని చెప్పినట్లు తెలుస్తోంది. 

రీ పోస్టుమార్టంపై కూడా వాదనలు వినిపించారు. డిసెంబర్ 06వ తేదీన ఎన్ కౌంటర్ జరిగిన రోజే..మహబూబ్ నగర్ ఆస్పత్రిలో నలుగురు నిందితుల డెడ్ బాడీస్‌కు పోస్టుమార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. మృతదేహాల అప్పగింతపై నిర్ణయం తీసుకొనే వరకు..గాంధీ ఆస్పత్రిలోనే భద్రపరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణలతో పోస్టుమార్టం నిర్వహించామని ప్రభుత్వం కోర్టకు తెలిపింది. పోస్టుమార్టం చేసిన వైద్యుల వివరాలను కోర్టుకు ఏజీ తెలియచేశారు. 

* 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి దిశా ఆచూకి తెలియలేదు.
* నవంబర్ 28వ తేదీ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో దిశ దారుణ హత్యకు గురైంది. 
* 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. 
* హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. నిందితులంతా దిశా స్కూటీని పంక్చర్‌ చేసి డ్రామాలు ఆడారు. తామే పంక్చర్‌ వేయిస్తామని చెప్పి.. ఆమె మాటల్లో పెట్టి కిడ్నాప్‌ చేశారు.
 

* దిశా రేప్ అండ్ మర్డర్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 
* నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. 
* కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని నవంబర్ 28న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 
* ఏ 1 మహ్మద్‌, ఏ 2 జొల్లు శివ, ఏ 3 చెన్నకేశవులు, ఏ 4 నవీన్ కుమార్‌లుగా వెల్లడించారు. 
 

* నవంబర్ 29వ తేదీన షాద్ నగర్ పీఎస్‌లో నిందితులను విచారించారు. 
* నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
* నవంబర్ 30న నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు. 
* షాద్ నగర్ నుంచి నిందితులను జైలుకు తరలిస్తుండగా నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. 
 

* నిందితులను ఉరి తీయాలని డిమాండ్ వినిపించాయి. 
* చంచల్ గూడకు నిందితులను తరలించాలని నిర్ణయించుకున్నారు. 
* తొలుత అలాగే భావించినా చివరకు చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. 
* హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
 

* మంత్రి కేటీఆర్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. చట్టాలను మార్చాలని విజ్ఞప్తి చేశారు. 
* డిసెంబర్ 04వ తేదీన నిందితులను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. 
* డిసెంబర్ 05వ తేదీన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 
 

* డిసెంబర్ 05వ తేదీన పోలీసుల విచారణ.
* నిందితుల సమాచారంతో దిశ సెల్ ఫోన్ స్వాధీనం.
* సంఘటనా స్థలంలో కీలక సాక్ష్యాలు సేకరించారు. 
* డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం నలుగురు నిందితుల ఎన్ కౌంటర్. 
Read More : హ్యాపీ బర్త్ డే : సీఎం జగన్‌కు మోడీ శుభాకాంక్షలు