Chain Snatching : కడపలో విషాదం చోటు చేసుకుంది. మెడలో గొలుసు తెంచుకుపోయే క్రమంలో… మహిళ చేతిలోని పసి కందు కిందపడి కన్నుమూసిన ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కడపలోని రామచంద్రాపురంలో భారతి అనే మహిళ నిన్నరాత్రి మేడ మీద నిద్రించింది. ఈ రోజు తెల్లవారు ఝూమున నిద్ర లేచి తన ఐదునెలల బిడ్డను ఎత్తుకుని కిందకు దిగుతోంది.
Also Read : Half-Day Schools : ఏపీలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు
ఈ సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఒకడు ఆమె మెడలోని బంగారు గొలుసు తెంపుకుపోయాడు. ఈక్రమంలో ఆమె చేతిలోని పసికందు జారి కిందపడి మరణించాడు. దీంతో ఆ తల్లి శోకంతో తల్లడిల్లిపోతోంది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.