అప్పుడే పెళ్లి చేసుకుంది. అత్తారింటికి బయలుదేరింది. కుటుంబసభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. కానీ ఒక్కసారిగా వారికి షాకింగ్ కలిగించే న్యూస్ తెలిసింది. కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియరావడం లేదు. ఈ విషాద ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ అలపూర్ కు చెందిన యువతి వివాహం మద్యప్రదేశ్ రాష్ట్రంలో షియోపూర్ లో వివాహం జరిగింది. 2020, జూన్ 14వ తేదీ ఆదివారం జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం అత్తారింటికి సాగనంపే కార్యక్రమం జరిగింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో అత్తా మామలు, భర్తతో కలిసి కారులో బయలుదేరింది.
షియోపూర్ చంబల్ నది వంతెన పై నుంచి కారు వెళుతోంది. తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని డ్రైవర్ ని కోరింది. కానీ అతను నిరారించాడు. అమాంతం యువతి గట్టిగా..స్టీరింగ్ పట్టుకుంది. సడెన్ గా బ్రేకులు వేశాడు. పెళ్లి కుమారుడు, అత్తా, మామలకు అసలు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు.
కారు దిగడం..అమాంతం నదిలో దూకడం జరిగిపోయాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. నదిలో దూకిన వధువు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. పెళ్లి జరిగిన సమయంలో తను బాగానే ఉందని, ఏమి జరిగిందో అర్థం కాలేదని పెళ్లి కుమారుడు తండ్రి వెల్లడించారు.