Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం

అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని  ప్రమాదంలో తల్లీ కూతుళ్లు సజీవ దహనం  కావటం కోనసీమ జిల్లాలో కలకలం రేపుతోంది.  జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్గమయ్యింది.

Fire Accident :  అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని  ప్రమాదంలో తల్లీ కూతుళ్లు సజీవ దహనం  కావటం కోనసీమ జిల్లాలో కలకలం రేపుతోంది.  జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్గమయ్యింది.

ఈ ఘటనలో పూరింట్లో నివసిస్తున్న తల్లీ, కూతుళ్లు సజీవదహనం అయ్యారు. తల్లి సాధనాల మంగాదేవి(40) ఆమె కుమార్తె మేడిశెట్టి జ్యోతి(23) మంటల్లో కాలి మరణించారు. 5 నెలల క్రితం కూతుర జ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది.  ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉంది.

ఈఘటన తెల్లవారు  ఝూమున 2 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన ప్రమాద వశాత్తు జరిగిందా లేక వేరే కుట్ర కోణం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లీ కూతుళ్లు ఇద్దరినీ హత్య చేసి ఇల్లు తగల బెట్టినట్టుగా పోలీసులు అనుమానించి అల్లుడు మేడిశెట్టి సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read : Udaipur Killing : ఉదయ్‌పూర్ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు

ట్రెండింగ్ వార్తలు