హైదరాబాద్లో కొత్త తరహా మోసం బయటపడింది. స్కూల్స్ను టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించిన ఓ
హైదరాబాద్లో కొత్త తరహా మోసం బయటపడింది. స్కూల్స్ను టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించిన ఓ యువతి.. ఈజీ మనీ కోసం సైబర్ నేరాల బాటపట్టింది. పలు స్కూల్స్కు చెందిన ఫోటోలను వారి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి డౌన్లోడ్ చేస్తుంది. ముఖ్యంగా మీటింగ్, ఫంక్షన్ ఫొటోలను సేకరిస్తుంది. అలా సేకరించిన వాటిని మార్ఫింగ్ చేస్తుంది. ఆ ఫోటోలను తిరిగి బాధిత పాఠశాలలకు పంపుతుంది. వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది.
అనంతరం ఆ స్కూల్ బాధ్యులను కలిసి.. తాను సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నానని.. మార్ఫింగ్ ఫోటోలను డిలీట్ చేస్తానంటూ డబ్బు దండుకుంటోంది. కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు బయటపడింది. నిందితురాలని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె సెల్ఫోన్లో 225 స్కూళ్ల వివరాలు ఉన్నట్టు గుర్తించారు. ఈజీ మనీ కోసమే యువతి సైబర్ నేరాల బాటపట్టినట్టు గుర్తించారు.
కిలాడీ లేడీ మార్ఫింగ్ మోసం బట్టబయలు కావడంతో బాధితులు ఊపిరిపీల్చుకున్నారు. ఆమెని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. కిలాడీ లేడీ చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మోసపోయామని, డబ్బు కోల్పోయామని వాపోతున్నారు. కాగా, ఈ తరహా మోసం పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకా ఎంతమందిని మోసం చేసింది, ఎంత డబ్బు గుంజింది అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.