Odisha train accident Updates: ఒడిశా ఘోర రైలు ప్రమాదం అప్ డేట్స్… బాలాసోర్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన ఘటనలో 300 మందికి పైగా మరణించారు.మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పడంతో అవి ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్పై పడిపోయాయి. తదనంతరం బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్లను ఢీకొంది. దీంతో బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోచ్లు నాలుగు పట్టాలు తప్పాయి.ఈ విషాదానికి తోడు గూడ్స్ రైలు కూడా ప్రమాదంలో చిక్కుకుంది. మూడు రైళ్లు ఢీకొనడంతో మృతుల సంఖ్య పెరిగింది.
2.6.2023: శుక్రవారం రాత్రి నుంచి : బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతున్నారు.సహాయ పునరావాస పనులు ముమ్మరం
3.6.2023: ఒడిశా రైలు ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తయ్యాయి, రైళ్ల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి.
– ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం తర్వాత పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
– రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
– మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 50వేలు ఎక్స్ గ్రేషియా
3.6.2023: బాలాసోర్ లో చిక్కుకుపోయిన ప్రయాణికులతో చెన్నైకి ప్రత్యేక రైలు బయలుదేరింది. బాలాసోర్ రైలు ప్రమాదం కారణంగా ఒడిశాలోని భద్రక్ నుంచి చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకుని ప్రత్యేక రైలు చెన్నైకి బయలుదేరింది.250 మంది ప్రయాణికులతో కూడిన ప్రత్యేక రైలు అన్ని షెడ్యూల్ స్టాప్లలో ఆగుతుంది. ప్రత్యేక రైలు ఆదివారం ఉదయం 9 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.
– ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ బాలాసోర్ వచ్చారు.
-బహనాగా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దృష్ట్యా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ఒక రోజు సంతాప దినాలు పాటించాలని ఆదేశించారు. అందువల్ల జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఏ రాష్ట్ర వేడుకలు జరగవు.
-ఒడిశా రైలు దుర్ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సంతాపం
– బాలాసోర్ లో సహాయక చర్యలు ముమ్మరం… మృతుల సంఖ్య 280కి చేరుకోగా, 120కి పైగా మృతదేహాలను వెలికితీశారు.
– పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ బాలాసోర్ చేరుకున్నారు.
-పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ శనివారం బాలాసోర్లోని ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేరుకున్నారు.
-భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు