మావోయిస్టు క్యాంపులను ధ్వంసం చేసిన పోలీసులు 

ఛత్తీస్ గడ్ లో పోలీసులు కూంబింగ్ నిర్వహించి మావోయిస్టుల స్థావరాలను గుర్తించారు.

  • Publish Date - February 9, 2019 / 11:18 AM IST

ఛత్తీస్ గడ్ లో పోలీసులు కూంబింగ్ నిర్వహించి మావోయిస్టుల స్థావరాలను గుర్తించారు.

ఛత్తీస్ గడ్ : సుక్మా జిల్లా దుల్లెడలో పోలీసులు కూంబింగ్ నిర్వహించి మావోయిస్టుల స్థావరాలను గుర్తించారు. మావోయిస్టుల క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. అయితే పోలీసుల రాకను గమనించిన మావోయిస్టులు..అక్కడి నుంచి తప్పించుకున్నారు. పెద్ద మొత్తంలో ల్యాండ్ మైన్లు, జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి పలు చోట్ల దాడులకు పాల్పడుతున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టుల కోసం జల్లెడపడుతున్నారు. మావోయిస్టులు, వారి స్థావరాలపై దాడులకు పాల్పడుతున్నారు. 

ట్రెండింగ్ వార్తలు