శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 33 బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న థామస్ అనే ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారానికి సరైన లెక్కలు చూపకుండా అక్రమంగా తరలిస్తున్న థామస్ ను సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.