Nizamabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్య.. నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యల కలకలం

సదాశివనగర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేశారు.

నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపాయి. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. 15 రోజుల వ్యవధిలో వారందరూ మర్డర్ అయ్యారు. వారందరిని హత్య చేసింది ఒక్కడే. వాడే సైకో కిల్లర్. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని విడివిడిగా చంపేసి, వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలు పారేశాడు నర హంతకుడు.

Also Read : అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం.. ఆసుపత్రిలో చేరిక

సదాశివనగర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. బాల్కొండ సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. మాచారెడ్డిలో మరొకరి డెడ్ బాడీ లభించింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తేలడంతో పోలీసులు షాక్ కి గురయ్యారు. మృతులను ప్రసాద్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు, ప్రసాద్ సోదరీమణులు ఉన్నారు. ప్రసాద్ తల్లి మాత్రమే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే, వారు కనిపించకుండా పోయినా.. ఎక్కడా మిస్సింగ్ కేసులు నమోదు కాకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఆస్తి (ఇంటి) కోసమే వరుస హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాక్లుర్ కు చెందిన నిందితునిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Also Read : తిరుపతిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆ తర్వాత..

ట్రెండింగ్ వార్తలు