అర ఎకరం భూమి కోసం తండ్రిని చంపేశాడు

వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదంలో కన్నకొడుకు.. తండ్రిని అతి కిరాతంగా హత్యచేశాడు.

  • Publish Date - December 17, 2019 / 11:29 AM IST

వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదంలో కన్నకొడుకు.. తండ్రిని అతి కిరాతంగా హత్యచేశాడు.

వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. భూమి వివాదంలో కన్నకొడుకు.. తండ్రిని అతి కిరాతంగా హత్యచేశాడు. అర ఎకరం భూమి కోసం రాయితో కొట్టి తండ్రిని చంపేశాడు. ఈ ఘటన పుల్గరచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

పుల్గరచర్ల గ్రామంలో తన పేరు మీద ఉన్న అర ఎకరం భూమి ఇవ్వాలంటూ తండ్రి.. కొడుకుతో పలుమార్లు గొడవకు దిగాడు. ఈ క్రమంలో మద్యం తాగి కొడుకు ఇంటికి వెళ్లాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు రాయితో కొట్టి తండ్రిని చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అవుతున్నాయి. డబ్బు, భూమి, నగల కోసం హత్యలు చేస్తున్నారు. ఆస్తి కోసం కుటుంబం, బంధువులను వదులుకుంటున్నారు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, అన్నదమ్ముల బంధాలకు దూరం అవుతున్నారు. డబ్బు, ఆస్తులుగా భావిస్తున్నారు. ఎలాంటి నేరాలు చేయడానికైనా వెనుకాడటం లేదు.

ట్రెండింగ్ వార్తలు