Virat Kohli Fan: రోహిత్ శర్మ మద్దతుదారుడి దారుణ హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు.. విరాట్ కోహ్లి వీరాభిమానికి జీవిత ఖైదు..

రోహిత్ శర్మ మద్దతుదారుడిని విరాట్ కోహ్లి అభిమాని దారుణంగా హత్య చేయడానికి కారణం ఏంటి? ఇద్దరి మధ్య ఏం జరిగింది?

Virat Kohli Fan: రోహిత్ శర్మ మద్దతుదారుడి దారుణ హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు.. విరాట్ కోహ్లి వీరాభిమానికి జీవిత ఖైదు..

Updated On : September 6, 2025 / 12:33 AM IST

Virat Kohli Fan: ఓ హత్య కేసులో తమిళనాడు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి వీరాభిమానికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మద్దతుదారుడి హత్య కేసులో కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

అక్టోబర్ 2022లో తమిళనాడులోని వెనుకబడిన జిల్లా అరియలూర్‌లోని పొయ్యూర్ గ్రామంలో 25 ఏళ్ల కోహ్లీ అభిమాని ధర్మరాజ్ తన స్నేహితుడు విఘ్నేష్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. రోహిత్ శర్మ అభిమాని అయిన విఘ్నేష్, కోహ్లీకి మద్దతిచ్చినందుకు ధర్మరాజ్‌ను ఎగతాళి చేశాడు. కోహ్లీ ఐపీఎల్ జట్టుకు బదులుగా శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టును ప్రశంసించడానికి ప్రయత్నించాడు.

ఇది కాస్తా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఘర్షణగా మారింది. విఘ్నేష్ తలపై బాటిల్, క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు ధర్మరాజ్. తీవ్ర గాయాలతో విఘ్నేష్ చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ధర్మరాజ్‌ను అరెస్ట్ చేశారు.

విచారణ పూర్తయిన తర్వాత అరియలూర్ జిల్లా సెషన్స్ కోర్టు ధర్మరాజ్‌ను హత్య కేసులో దోషిగా నిర్ధారించింది. గురువారం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి మలార్ వాలెంటినా హత్య అభియోగంపై ధర్మరాజ్‌కు జీవిత ఖైదు విధించారు.

Also Read: సమోసా ఎంత పని చేసిందిరా అయ్యా..! సమోసా తీసుకురాలేదని.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..

క్రికెటర్ల మీద, సినిమా స్టార్ల మీద అభిమానం ఉండటం తప్పు కాదు. వారిని ఆరాధించడం కూడా తప్పేమీ కాదు. అయితే, అభిమానం హద్దుల్లోనే ఉండాలి. అది మితిమీరితే అనర్థాలు జరగడం ఖాయం. అభిమానం పేరుతో గొడవలకు దిగడం, ఘర్షణ పడటం కరెక్ట్ కాదు. క్రికెటర్లు, సినిమా స్టార్లు అంతా హ్యాపీగానే ఉంటారు. వారి మధ్య ఎలాంటి విబేధాలు ఉండవు. మరి ఫ్యాన్స్ ఎందుకు ఇలా గొడవలకు దిగుతున్నారో అర్థం కాని పరిస్థితి. అభిమానం పేరుతో హత్య చేయడం ఆందోళన కలిగించే అంశం. ఆవేశంలో చేసే పని జీవితాలను నాశనం చేస్తుంది.