Pragati Maidan Tunnel: ఢిల్లీలో హైటెక్ చోరీలు.. కార్లు ఆపని టన్నెల్ కేంద్రంగా నేరాలు
నగరంలోని ప్రగతి మైదాన్ టన్నెల్లో ఇలాంటి చోరీనే ఒకటి వెలుగు చూసింది. డెలివరీ ఏజెంట్ సహా అతని సహచరుడిని టన్నెల్లో ఆపి దోపిడీకి పాల్పడ్డారు కొందరు. ఇతర కార్లు అక్కడ ఆగవని వారు భావించారని స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ రవీంద్ర సింగ్ యాదవ్ మంగళవారం తెలిపారు
- tony bekkal
- Published On : June 27, 2023 / 06:00 PM IST
Delhi: గడ్డి తినడానికి చాలానే అడ్డదారులు అన్నట్లు.. దేశ రాజధాని ఢిల్లీలో చోరీలకు కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి. పట్టపగలే దొపిడీ చేసినా దొరకకుండా ఉండేందుకు వాహనాలు ఆపని టన్నెల్ను కేంద్రంగా చేసుకున్నారు. కారణం.. అక్కడ వాహనాలేవీ ఆపరు కాబట్టి.
నగరంలోని ప్రగతి మైదాన్ టన్నెల్లో ఇలాంటి చోరీనే ఒకటి వెలుగు చూసింది. డెలివరీ ఏజెంట్ సహా అతని సహచరుడిని టన్నెల్లో ఆపి దోపిడీకి పాల్పడ్డారు కొందరు. ఇతర కార్లు అక్కడ ఆగవని వారు భావించారని స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ రవీంద్ర సింగ్ యాదవ్ మంగళవారం తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరితో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశామని, వారి నుంచి 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
‘‘అప్పుల బాధతో డెలివరీ అయిన బురారీకి చెందిన 25 ఏళ్ల ఉస్మాన్ దోపిడీకి ప్లాన్ చేశాడు. తన బంధువు ఇర్ఫాన్ను కూడా ఈ చోరీకి తీసుకున్నాడు. బాగ్పత్కు చెందిన మరికొందరు కూడా ఉన్నారు. ఒక అనుజ్ మిశ్రా అలియాస్ సుంకీ, సుమిత్ అకా ఆకాష్ కూడా ఉన్నారు. ప్రదీప్, మూడు రోజుల పాటు రెసిపీ నిర్వహించి, సొరంగం లోపల ఇతర కార్లు ఆగవని భావించి నేరం చేసేందుకు సొరంగాన్ని ఎంచుకున్నారు’’ అని ప్రగతి మైదాన్ సొరంగం దోపిడీ కేసుపై స్పెషల్ సీపీ క్రైం బ్రాంచ్ రవీందర్ యాదవ్ తెలిపారు.
