పంజాబ్లో ఘోర ప్రమాదం సంభవించింది. మొహాలీలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
పంజాబ్లో ఘోర ప్రమాదం సంభవించింది. మొహాలీలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వారిని రక్షించే పనులు కొనసాగుతున్నాయి.
మూడంతస్తుల భవనం పక్కన జేసీబీతో పునాది కోసం తవ్వకాలు చేపట్టిన సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. విపత్తు నివారణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మూడు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పలువురికి గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడినట్టు సహాయక బృందాల సభ్యులు తెలిపాయి. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.