ఇంత దారుణమా : యువకుడిని చితక్కొట్టి..మూత్రం పోశారు

  • Publish Date - December 22, 2019 / 04:18 AM IST

ఓ యువకుడిని చితక్కొట్టారు. చెట్టుకు కట్టేసి..దారుణంగా హింసించారు. అంతటితో ఆగక..అతని ముఖంపై మూత్రం పోసి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన..ఒడిషాలో చోటు చేసుకుంది. రాజధాని భువనేశ్వర్‌‌కు కేవలం కిలో మీటర్ దూరంలో ఉన్న ఖోద్రాలోని కైపదర్ గ్రామంలో చోటు చేసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు.

2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం నాడు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగిడా గ్రామానికి చెందిన ఓ యువకుడిని రావాలని కైపదర్ చెందిన ముగ్గురు యువకులు సూచించారు. దీంతో అతను ఆ గ్రామానికి వెళ్లాడు. వెంటనే ముగ్గురు యువకులు..అతడిని చెట్టుకు కట్టేసి. దారుణంగా కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. కనికరం లేకుండా చితకబాదారు. ముగ్గురు యువకుల్లో ఒకరు దుర్భషలాడుతూ..ముఖంపై మూత్రం చేశాడు.

ప్రేమ వ్యవహారంతోనే దాడి జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటన యొక్క వీడియో వైరల్ కావడంతో..పోలీసులు రెస్పాండ్ అయ్యారు. ఖోద్రా ఎస్పీ అజయ్ మాట్లాడుతూ…దీనిపై కేసు నమోదైందని..ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని, మిగతా ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నట్లు వెల్లడించారు. 
Read More : అందరి చూపు అటే : రామ్ లీలా మైదాన్‌లో మోడీ మెగా ర్యాలీ

ట్రెండింగ్ వార్తలు