Gandhi Hospital : గాంధీ ఆస్పత్రి బిల్డింగ్‌పై నుంచి దూకి కోవిడ్ రోగి ఆత్మహత్య ?

సికింద్రాబాద్‌లోని  గాంధీ ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి ఒక రోగి మృతి చెందాడు.  అతను కావాలని దూకి ఆత్మ‌హత్య చేసుకున్నాడా...లేక ప్రమాద వశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర

Gandhi Hospital : సికింద్రాబాద్‌లోని  గాంధీ ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి ఒక రోగి మృతి చెందాడు.  అతను కావాలని దూకి ఆత్మ‌హత్య చేసుకున్నాడా…లేక ప్రమాద వశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన వ్యక్తి  కరోనా రోగిగా గుర్తించారు. రోగి వివరాలు కూడా ఆసుపత్రిలో నమోదు కాకపోటంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరంకాని సర్జరీలను నిలిపివేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు మాత్రమే పూర్తి స్ధాయిలో సేవలు అందిస్తున్నారు.

Also Read : Sreekanth Vettiyar Rape Case : పెళ్లి పేరుతో అత్యాచారం చేసిన యూట్యూబర్ పై కేసు నమోదు

ట్రెండింగ్ వార్తలు