Maharashtra
Maharashtra : తన బర్త్ డే గ్రాండ్గా చేయాలని భర్తను కోరింది ఓ ఇల్లాలు. అందుకోసం ఓ డెస్టినేషన్ కూడా చెప్పింది. ఆమె డిమాండ్లను భర్త నెరవేర్చకపోవడంతో దారుణానికి ఒడిగట్టింది. విచక్షణా రహితంగా భర్తపై దాడి చేయడంతో అతను మరణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది.
Pranshu : ఇన్స్టా రీల్స్లో బ్యాడ్ కామెంట్స్ భరించలేక మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
తన కోరిక ప్రకారం పుట్టినరోజు వేడుకలు జరపలేదని రేణుక అనే మహిళ కిరాతాకానికి పాల్పడింది. భర్తపై దాడి చేయడంతో అతను చనిపోయినట్లు తెలుస్తోంది. అందరినీ షాక్కి గురి చేసిన ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. 38 సంవత్సరాల రేణుక అనే మహిళ సెప్టెంబర్ 18 న తన పుట్టినరోజు వేడుకలు దుబాయ్లో జరపాలని భర్త నిఖిల్ ఖన్నాను పట్టుబట్టింది. ఆమె కోరికను భర్త నెరవేర్చలేకపోయాడు. నవంబర్ 5న వీరి పెళ్లి రోజు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కూడా భర్త నుంచి ఎటువంటి బహుమతి రాలేదు. మరోవైపు బంధువుల పుట్టినరోజు వేడుకలకు ఢిల్లీ వెళ్లడానికి కూడా భర్త అంగీకారం దొరకలేదు. దాంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
Karnati Rambabu : దుర్గ గుడి ఛైర్మన్పై హత్యాయత్నం
తన డిమాండ్లు నెరవేర్చలేదని ఆవేశంలో రేణుక భర్తపై దాడి చేసిన ముఖంపై కొట్టడంతో అతని ముక్కు నుండి రస్రావమై స్పృహ కోల్పోయాడని తెలుస్తోంది. ఇరుగుపొరుగువారంతా వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. భర్త ముఖంపై రేణుక ఏదైనా వస్తువుతో కొట్టిందా.. లేక పిడికిలితో కొట్టిందా? అనేది ఇంకా తెలియలేదు. వాన్వాడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడు నిఖిల్ ఖన్నా రియల్ ఎస్టేట్ డెవలపర్ అని పోలీసులు చెబుతున్నారు. రేణుకపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.