అసభ్యంగా ప్రవర్తించాడని పూజారిపై మహిళలు దాడి

విజయవాడ గుడిలో పూజలు చేస్తున్న పూజారిపై మహిళలు దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పూజలు చేస్తున్న సమయంలో అతన్ని ఆలయంలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు.

  • Publish Date - November 3, 2019 / 07:09 AM IST

విజయవాడ గుడిలో పూజలు చేస్తున్న పూజారిపై మహిళలు దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పూజలు చేస్తున్న సమయంలో అతన్ని ఆలయంలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు.

విజయవాడ గుడిలో పూజలు చేస్తున్న పూజారిపై మహిళలు దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. భవానీపురం హెచ్ బీ కాలనీలోని సాయి త్రిశక్తి నిలయంలో కోట పవన్ అనే పూజారిని బయటికి ఈడ్చుకొచ్చి మహిళలు దాడి చేశారు. దీనికి సంబంధించిన సీపీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. 

విజయవాడకు చెందిన పూర్ణిమారెడ్డి కొందరు మహిళలతో కలిసి పూజారి పవన్ పై దాడి చేశారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పూజలు చేస్తున్న సమయంలో అతన్ని ఆలయంలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు. విశ్రాంత ఉద్యోగి ఆనం మోహన్ రెడ్డి భార్య, చెంచు లక్ష్మీ కూమార్తె పూర్ణిమారెడ్డి పూజారిని బయటికి లాగి చితకొట్టారు.
 
తన తండ్రిని చూసేందుకు ఇంటికి వచ్చిన సమయంలో పూజారి పవన్ తోపాటు మరొ ఇద్దరు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పుర్ణిమారెడ్డి తన తల్లికి చెప్పిడంతో ఆగ్రహించిన ఆమె పూజారిని చితకబాదింది. ఈ ఘటన భవానీపురంలో కలకలం రేపింది. ఇరువురు భవానీపురంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు