తెలంగాణ సీఎంకు రఘువీరారెడ్డి లేఖ
- veegam team
- Published On : April 30, 2019 / 10:51 AM IST
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. రాహుల్ కు మద్దతు ఇవ్వాలని లేఖ ద్వారా కేసీఆర్ ను కోరారు. హోదా అమలుపై కేసీఆర్ చేసిన ప్రకటనకు రఘువీరా ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వస్తే హోదాపైనే తొలి సంతకం చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీ ఏపీకి హోదా ఇవ్వలేమని ప్రకటించి మోసం చేసిందన్నారు.
