హిజ్రాలు డబ్బులు ఇవ్వని వ్యక్తులపై దాడి చేయడం.. దూషించడం తరచుగా జరుగుతోంది. వారి వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వాహనదారులను, ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులను అస్సలు వదలడంలేదు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో హిజ్రాలు విధ్వంసం సృష్టించారు. బస్స్టాప్లో కార్లు ఆపిన వారిపై దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. అడ్డువచ్చిన వారిని కూడా కొట్టి.. వాళ్ల మెడలో ఉన్న బంగారు గొలుసులు, పర్సులను, మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు.
బాధితులు భయంతో దగ్గరలో ఉన్న పోలీస్స్టేషన్కు పరుగులు తీశారు. అంతటితో ఆగకుండా పోలీస్స్టేషన్కు కూడా వెళ్లి వీరంగం సృష్టించారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేస్తూ.. అడ్డు తగిలిన ముగ్గురు పోలీసులను కూడా తీవ్రంగా గాయపరిచారు.
ఆ సమయంలో పోలీసులు అందుబాటులో లేకపోవడం, హిజ్రాలు భారీ సంఖ్యలో ఉండటంతో పరిస్థితి భయానకంగా మారింది. అప్పుడే వచ్చిన ACP నారాయణపై కూడా దాడికి చేసారు. అసహ్యంగా మాట్లాడుతు హంగామ సృష్టించారు. తర్వాత స్టేషన్కు వచ్చిన CI.. బాధితులు, గాయపడిన కానిస్టేబుళ్ల నుంచి ఫిర్యాదు తీసుకుని వారందరినీ చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రికి బయలుదేరిన బాధితులను కూడా కొంత దూరం వెంబడించారు.
ఈ ఘటనలో ఉప్పల్ పోలీసులు, బాధితులు ప్రదీప్రెడ్డి, రాంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్రెడ్డికి చెందిన కారును పూర్తిగా ధ్వంసం చేశారు. రాంరెడ్డికి చెందిన మొబైల్ ఫోన్, బంగారు గొలుసు, పర్సులను హిజ్రాలు లాక్కున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.