హైదరాబాద్ సిటీలో 42 కిలో మీటర్ల మేర మారథాన్ రన్ నిర్వహించారు. పీపుల్స్ నుంచి ప్రారంభించిన రన్.. గచ్చిబౌలి వరకూ కొనసాగించారు. భారీ సంఖ్యలో స్పందన రావడంతో వారు వెళ్లే దారి మొత్తం బ్లాక్ చేశారు. పాల్గొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని వాహనాలు నిలిపేశారు. దీంతో రోడ్లపైనే వాహనదారులు నిలిచిపోయారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు అంజనీ కుమార్ చేతుల మీదుగా పీపుల్స్ ప్లాజా నుంచి పరుగు ప్రారంభించారు.
రన్నర్స్ వెళ్లే ప్రాంతాలు : –
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, రాజ్ భవన్, రాజీవ్ గాంధీ విగ్రహం, సీఎం క్యాంపు ఆఫీసు, పంజాగుట్ట ఫ్లై ఓవర్, శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మ టెంపుల్, కావూరి హిల్స్ ఎక్స్ రోడ్డు, (లెఫ్ట్ టర్న్)…మాదాపూర్ పీఎస్, ఇమేజ్ హాస్పిటల్, సైబర్ టవర్స్..(లెఫ్ట్ టర్న్), కేఎఫ్సీ, ట్రిడెంట్ ఈ హోటల్, లెమన్ ట్రీ, మైండ్ స్పేస్, ఐకియా, మై హోం, బయోడైవర్సిటీ క్రాస్ రోడ్డు..(రైట్ టర్న్), సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం, గచ్చిబౌలి ఫ్లై ఓవర్ (రైట్ సైడ్)..ఇందిరానగర్, హిమగరి ఆస్పత్రి, ఐఐటి జంక్షన్, విప్రో (రైట్ టర్న్)…క్యూ సిటీ, గౌలిదొడ్డి, గొప్పన్నపల్లి క్రాస్ రోడ్డు..(రైట్ టర్న్)..హెచ్సీయూ వెస్ట్రన్ గేట్, యూనివర్సిటీ 2 గేట్..(రైట్ టర్న్)..గచ్చిబౌలి స్టేడియం గేట్ నెంబర్ 2 నుంచి హెచ్సీయూ..(రైట్ టర్న్).. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం..వరకు పరుగు జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు రన్ జరుగనుంది.