కాంగ్రెస్ కు భారీ షాక్ : టీఆర్ఎస్ గూటికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి 

కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ గూటికి చేరారు.

  • Publish Date - January 18, 2019 / 01:48 PM IST

కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ గూటికి చేరారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ ఒంటేరుపై గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పై గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంటేరు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్ చేరానని తెలిపారు. ’నేను ఎమ్మెల్యేగా గెలవాలనే తాపత్రయంతో కొట్లాడాను కానీ.. సీఎం కేసీఆర్ ను ఓడించాలని ఎప్పుడూ అనుకోలేదు’ అని అన్నారు. అహర్శిశలు కష్టపడి పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. 
 

ట్రెండింగ్ వార్తలు