తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన భార్య ఆర్తి రెడ్డితో కలిసి సూపర్స్టార్ రజినీకాంత్ను చెన్నైలో కలిశారు. రజనీకాంత్ నివాసంలో ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆశీర్వాదం తీసుకున్నారు రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డికి సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంతో అవినాభవ సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి రజినీకాంత్ దగ్గరకు వెళ్లి ఆయన ఆశిర్వాదం తీసుకున్నారు.
ఇదే సమయంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మాకానికి న్యాయం చేయాలని రజినీకాంత్ రోహిత్ రెడ్డికి సూచించారు. వ్యక్తిగత భేటిలో భాగంగానే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రజినీకాంత్ కలిశారు. రోహిత్ రెడ్డి ప్రస్తుతం అయ్యప్ప మాలధారణలో ఉన్నారు.
రోహిత్ రెడ్డి గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ టికెట్ లభించకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన రోహిత్ రెడ్డి తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల తర్వాత రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు.