ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గజ్వేల్ లో పర్యటిస్తారు. అక్కడ జరిగే పలు అభివృధ్ది కార్యక్రమాలో పాల్గోంటారు. తన సొంత నియోజక వర్గం పర్యటనలో భాగంగా కేసీఆర్ ఉదయం 11కి సిద్దిపేట జిల్లా, ములుగులోని ఫారెస్ట్ కాలేజీకి చేరుకుంటారు.
కేసీఆర్ పర్యటన ఇలా ..
> ములుగులో ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నూతన భవన ప్రారంభోత్సవం చేస్తారు. కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడే ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులతో సమావేశమవుతారు.
> అక్కడి నుంచి బయలు దేరి శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన గుడిలో పూజలు నిర్వహిస్తారు, అనంతరం యూనివర్సిటీని ప్రారంభిస్తారు.
> ఆ తర్వాత గజ్వేల్ పట్టణంలో సమీకృత మార్కెట్ను, సమీకృత కార్యాలయ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు.
> ములుగులోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు, గజ్వేల్ టౌన్లో వంద పడకల మాతా–శిశు ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేస్తారు.
> గజ్వేల్ టౌన్లోని మహతి ఆడిటోరియం ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
> గజ్వేల్ టౌన్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు సీఎం ప్రగతిభవన్కు చేరుకుంటారు.