×
Ad

Indian Woman Missing : క్రూయిజ్ షిప్‌లో భారతీయ మహిళ అదృశ్యం

క్రూయిజ్ షిప్‌లో సింగపూర్ బయలుదేరిన భారతీయ మహిళ అదృశ్యం అయిన ఘటన సంచలనం రేపింది. ఉత్తర ద్వీపమైన మలేషియాలోని పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణించే క్రూయిజ్ షిప్‌లో ఉన్న 64 ఏళ్ల భారతీయ మహిళ అదృశ్యమైంది....

  • Published On : August 1, 2023 / 09:13 AM IST

Cruise Ship

Indian Woman Goes Missing From Cruise Ship : క్రూయిజ్ షిప్‌లో సింగపూర్ బయలుదేరిన భారతీయ మహిళ అదృశ్యం అయిన ఘటన సంచలనం రేపింది. ఉత్తర ద్వీపమైన మలేషియాలోని పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణించే క్రూయిజ్ షిప్‌లో ఉన్న 64 ఏళ్ల భారతీయ మహిళ అదృశ్యమైంది.

Communal Violence : హర్యానాలో మత హింస..ముగ్గురి మృతి

స్పెక్ట్రమ్ ఆఫ్ సీస్‌లో పెనాంగ్ నుంచి సింగపూర్‌కు తిరిగి వస్తుండగా రీటా సహానీ,ఆమె భర్త జాకేష్ సహానీతో కలిసి క్రూయిజ్ షిప్ లో ప్రయాణిస్తోంది. (Cruise Ship Sailing Out Of Singapore) తన భార్య రీటా సహానీ తమ గదిలో నుంచి తప్పిపోయిందని భర్త జాకేష్ ఓడ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. (Indian Woman Goes Missing) సింగపూర్ జలసంధిలో ఏదో పడిపోయినట్లు ఓడ ఓవర్‌బోర్డ్ డిటెక్షన్ సిస్టమ్స్‌కు తెలియజేసినట్లు జాకేష్ చెప్పారు.

Maharashtra : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం…15 మంది మృతి

తన తల్లి అదృశ్యంపై అతని కుమారుడు అపూర్వ్ సహాని ఆందోళన వ్యక్తం చేశారు. హాలిడేలో ఆనందంగా గడిపేందుకు వెళ్లి తన తల్లి అదృశ్యమైందని అపూర్వ్ ఆరోపించారు. ఈ అదృశ్యం గురించి సింగపూర్‌లోని మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ సముద్రతీర రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు తెలియపర్చింది.