Odisha Bus Accident : ఒడిశాలో రెండు బస్సులు ఢీ, 10 మంది మృతి, 8మందికి గాయాలు

ఒడిశా రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని దిగపహాండి వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు....

Odisha Bus Accident

Odisha Bus Accident : ఒడిశా రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని దిగపహాండి వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

Monsoon Warnings issued : రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు

క్షతగాత్రులను ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని గంజాం జిల్లా మెజిస్ట్రేట్ దిబ్యా జ్యోతి పరీడా చెప్పారు. క్షతగాత్రులకు అన్ని రకాల వైద్యసహాయం చేస్తామని దిబ్యా జ్యోతి చెప్పారు. ఈ బస్సు ప్రమాదంపై తాము దర్యాప్తు చేస్తున్నామని గంజాం పోలీసులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు