Israel Palestine Conflict: హమాస్‭కు మద్దతిచ్చే వారికి సీఎం యోగి హెచ్చరికలు.. సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ప్రధాని మోదీ, హోం మంత్రి, రక్షణ మంత్రితో సహా దేశంలోని అనేక పెద్ద ముఖాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే దేశంలోని ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు

Israel Palestine Conflict: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుందని, ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలంటూ ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. గురువారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిషన్ శక్తి చట్టంతో పాటు రాబోయే పండుగల సన్నాహాలకు సంబంధించి అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు, పోలీసు కమిషనర్‌లు/యూపీలోని సీనియర్ సూపరింటెండెంట్‌లు/పోలీసు సూపరింటెండెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంలోనే ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని ప్రస్తావిస్తూ.. డిపార్ట్‌మెంటల్ అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వ్యాఖ్యానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: Indians Returned : ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి.. తొలి విమానంలో 212 భారతీయులు

ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వచ్చేలా పోలీసు అధికారులందరూ తమ ప్రాంతంలోని వివిధ మత పెద్దలతో కమ్యూనికేట్ చేయాలని అన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత ప్రభుత్వ అభిప్రాయాలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలను రాష్ట్రంలో అంగీకరించబోమని యోగి హెచ్చరించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ప్రధాని మోదీ, హోం మంత్రి, రక్షణ మంత్రితో సహా దేశంలోని అనేక పెద్ద ముఖాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే దేశంలోని ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు హమాస్, పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: Harish Rao : బెంగళూరులో ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు కాంగ్రెస్ నేతవే.. రాష్ట్రంలో డబ్బులు పంచి గెలవాలనుకుంటున్నారు : మంత్రి హరీష్ రావు

దీనిపై అలీఘఢ్ నుంచి ఒక కేసు కూడా వచ్చింది. అక్కడి ఏఎంయూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సీఎం యోగి అధికారులతో సమావేశం నిర్వహించి కఠిన ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు సోషల్ మీడియాపై కూడా నిఘా ఉంచాలని సీఎం యోగి అధికారులకు సూచించారు. సామాజిక మాధ్యమాలైనా, మతపరమైన ప్రదేశాలైనా ఎక్కడి నుంచి ఎలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు వెలువడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం యోగి సూచించారు.

ట్రెండింగ్ వార్తలు