కరోనా వైరస్ మహహ్మారిని నియంత్రించేందుకు కృత్రిమ జీవశాస్త్రం, కృత్రిమ మేధతో కూడిన అత్యాధునిక సాంకేతికతల సాయం తీసుకుంటున్నామని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన జిమ్ కోలిన్స్ అన్నారు. కరోనా నివారణకు టీకా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యాంటీ బయోటిక్ మందులకూ తగ్గని బ్యాక్టీరియాను ఎదుర్కొనే ప్రాజెక్టును కరోనాతో మార్చేశామని చెప్పారు.
మెషీన్ లెర్నింగ్ను కరోనా టీకా, చికిత్సకు అవసరమైన మందులను డెవలప్ చేసేందుకు వినియోగించవచ్చునని కోలిన్స్ తెలిపారు. ప్రస్తుతం మూలకాల ట్రైనింగ్ లైబ్రరీ సిద్ధం చేస్తున్నామని, కరోనా వైరస్పై ప్రయోగించి సమర్థంగా పనిచేస్తున్నాయో గుర్తిస్తున్నామని చెప్పారు. గుర్తించిన మూలకాలను వైరస్పై ప్రయోగించడం ద్వారా టీకా, మందుల తయారీని వేగవంతం చేయొచ్చనని తెలిపారు.
కరోనా వైరస్ను వీలైనంత వేగంగా గుర్తిస్తే చికిత్స అంత సులువు కాదన్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే.. కణాల్లోని వ్యవస్థలను వేరు చేసి.. వాటిని కాగితంపై అతికించొచ్చనని అంటున్నారు. RNAను జోడించడం ద్వారా ఎబోలా, జికా వైరస్లను చౌకగా గుర్తించే కిట్లు గతంలో తయారయ్యాయని కోలిన్స్ గుర్తుచేశారు. ఇదే టెక్నాలజీని కాగితంపై కాకుండా వస్త్రాలపై వాడొచ్చు అన్నారు.
వస్త్రాలపై వాడటం ద్వారా వైరస్ ఉనికిని వెంటనే గుర్తించవచ్చునని అన్నారు. ఇలాంటి వస్త్రాలను RNA సెన్సార్లతో ఫేస్ మాస్క్లను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. శ్వాస తీసుకున్నప్పుడు వచ్చే తేమలో చెమ్మలో వైరస్ ఉంటుంది. ఒకవేళ వైరస్ ఉంటే.. మాస్క్ తయారైన వస్త్రంలో RNA సెన్సర్లు వెంటనే స్పందిస్తాయని అన్నారు. వెంటనే మాస్కు రంగు మారిపోతుందని తెలిపారు. ఈ పద్ధతిలో వైరస్ సోకిన ఒకట్రెండు గంటల్లోనే రోగిని గుర్తించడం వీలు అవుతుంది.
క్షయ వ్యాధి నివారణ కోసం దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న బీసీజీ టీకానే కొన్ని మార్పులు చేయడం ద్వారా కరోనా వైరస్ను ఎదుర్కోవచ్చనని కోలిన్స్ చెబుతున్నారు. బలహీనమైన వైరస్ సాయంతో తయారైన బీసీజీ టీకాను అవసరానికి తగ్గట్టుగా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. వైరస్లో కొన్ని మార్పులు చేసి కరోనా వైరస్ను నిర్వీర్యం చేయగల యాంటీజెన్లు ఉత్పత్తి చేస్తే కరోనాకు టీకా సిద్ధమవుతుందని భావిస్తున్నారు.