US Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది పిల్లలు మృతి
ఈ కాల్పుల ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
- Naveen
- Updated on- April 20, 2026 / 01:13 AM IST
US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. లూసియానాలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది పిల్లలు చనిపోయారు. పిల్లలు 1-14 ఏళ్ల వయసులోపు వారే. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగులు హతమైనట్లు సమాచారం.
ఈ కాల్పుల ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపై విచారణ జరపమని ష్రెవెపోర్ట్ పోలీసులు తమ డిటెక్టివ్లను కోరారని లూసియానా రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిని వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు.
ఈ సంఘటన వాయువ్య లూసియానాలోని ష్రెవెపోర్ట్లో జరిగింది. ఇది రెండు నివాసాల మధ్య విస్తరించి ఉన్న చాలా పెద్ద నేర ప్రదేశం. దర్యాప్తు అధికారులు మూడవ నివాసాన్ని కూడా జల్లెడ పడుతున్నారు. మృతుల వయసు ఒకటి నుండి 14 సంవత్సరాల మధ్య ఉంది. పిల్లలలో కొందరు అతని వారసులు. వాహనాన్ని వెంబడిస్తున్న సమయంలో అనుమానిత షూటర్ను పోలీసులు కాల్చి చంపారు” అని పోలీస్ చీఫ్ వేన్ స్మిత్ చెప్పారు.
“ఇది ఒక విషాదకరమైన పరిస్థితి. బహుశా మనం ఇప్పటివరకు ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన విషాదం ఇదే కావచ్చు” అని ష్రెవెపోర్ట్ మేయర్ టామ్ ఆర్సెనెక్స్ అన్నారు. ష్రెవెపోర్ట్ వాస్తవ్యుడైన యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్, ఈ “హృదయ విదారక విషాదం” గురించి తమ బృందం స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“ఈ అత్యంత క్లిష్ట సమయంలో బాధితులను, వారి కుటుంబాలను, ప్రియమైన వారిని, మా ష్రెవెపోర్ట్ సమాజాన్ని మా ఆలోచనలలో ప్రార్థనలలో దగ్గరగా ఉంచుకుంటున్నాము. ఈ భయంకరమైన సంఘటన పట్ల నేను నా భార్య హృదయ విదారకంగా ఉన్నాము. ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాము” అని లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీ తెలిపారు.
ఈ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్లో కనీసం 119 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కాల్పుల్లో 79 మంది పిల్లలతో సహా 117 మంది మరణించగా 458 మంది గాయపడ్డారు. అధికారుల లెక్కల ప్రకారం గత సంవత్సరం యునైటెడ్ స్టేట్స్లో 407 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి.
Also Read: పశ్చిమాసియాలో మరో జలసంధి క్లోజ్..? భారత్పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం..
