Chinese Scientists: గాలిలో రాయగలిగే లేజర్ కనిపెట్టిన చైనీస్ సైంటిస్టులు

చైనా రీసెర్చర్లు గాలిలో రాయగలిగే లేజర్ కనిపెట్టారు. వూహాన్ కు చెందిన సైంటిస్టుల టీం.. ఎటు నుంచైనా రాయగలిగే, స్పర్షించేలా అక్షరాలను రాసే లేజర్ రూపొందించారు. అల్ట్రా షార్ట్ లేజర్ పల్సెస్‌తో గాలి అణువులను లైట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీని పలు రంగాల్లో వినియోగిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Laser

 

 

Chinese Scientists: చైనా రీసెర్చర్లు గాలిలో రాయగలిగే లేజర్ కనిపెట్టారు. వూహాన్ కు చెందిన సైంటిస్టుల టీం.. ఎటు నుంచైనా రాయగలిగే, స్పర్షించేలా అక్షరాలను రాసే లేజర్ రూపొందించారు. అల్ట్రా షార్ట్ లేజర్ పల్సెస్‌తో గాలి అణువులను లైట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీని పలు రంగాల్లో వినియోగిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

“కొత్త డివైజ్‌తో గాలిలో పేపర్, ఇంక్ లేకుండానే రాయగలం” అని వూహాన్ లోయలోని హోంగ్తువ ల్యాబొరేటరీ లీడ్ సైంటిస్ట్ కావో జియాంగ్‌డంగ్ తెలిపారు. దశాబ్ద కాలానికి పైగా జరిపిన పరిశోధన సక్సెస్ అయిందని వెల్లడించారు.

కేవలం కొన్ని ఫెమ్టోసెకన్‌ల వరకు ఉండే పల్స్‌లను ఉపయోగించే డిస్‌ప్లేలు క్రియేట్ అవుతాయి. ఇది సెకనులో ఒక క్వాడ్రిలియన్ లేదా ఒక బిలియన్‌లో ఒక మిలియన్ వంతుకు సమానం, వాటిని షూటౌట్ చేయడానికి మిలియన్ మెగావాట్ల శక్తి అవసరం.

Read Also: వుహాన్ పరిస్థితులపై శాస్త్రవేత్తల భయం భయం

గాలిని కాంతిగా మార్చడానికి, శక్తి సాంద్రత చదరపు సెంటీమీటర్‌కు దాదాపు ట్రిలియన్ వాట్స్ అవసరం.

దేశంలో అధునాతన టెక్నాలజీ ఫీల్డ్‌లను పెంచే ప్రణాళికల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వుహాన్‌లోని లేజర్ కంపెనీలను సందర్శించిన కొద్ది వారాల తర్వాత లేజర్‌ను ఆవిష్కరించడం జరిగింది.