CJI Chandrachud: అమలు చేసేవారు సరిగా ఉంటే చెడు రాజ్యాంగం కూడా బాగుంటుంది.. అమెరికా మీటింగులో అంబేద్కర్ మాటల్ని ప్రస్తావించిన సీజేఐ

సీజేఐ తన ప్రసంగంలో అంబేద్కర్ రాజ్యాంగ వాదం గురించి ప్రస్తావించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను పెంపొందించడం ద్వారా భారతీయ సమాజాన్ని మార్చేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు

CJI Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ రాజ్యాంగవాదంపై మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ అభిప్రాయాలను ప్రశంసించారు. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాని పనితీరుకు బాధ్యులైన వ్యక్తులు సరిగా ఉన్నప్పుడే రాజ్యాంగం మంచిదని రుజువు అవుతుందని చంద్రచూడ్ అన్నారు. ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అసంపూర్ణ వారసత్వం’ అనే అంశంపై ఆరవ అంతర్జాతీయ సదస్సులో తన ప్రసంగంలో సీజేఐ చంద్రజూద్ ఈ వ్యాఖ్య చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌లోని వాల్తామ్‌లోని బ్రాండీస్ యూనివర్సిటీలో ఆదివారం ఈ సదస్సు జరిగింది.

సీజేఐ తన ప్రసంగంలో అంబేద్కర్ రాజ్యాంగ వాదం గురించి ప్రస్తావించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను పెంపొందించడం ద్వారా భారతీయ సమాజాన్ని మార్చేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. అంబేద్కర్ వారసత్వం ఆధునిక భారత రాజ్యాంగ విలువలను రూపొందిస్తోందని, అందరికీ న్యాయం చేయాలనే సాధనలో దివిటీగా నిలుస్తోందని అన్నారు. హార్వర్డ్ లా స్కూల్‌లోని న్యాయ వృత్తిపై కేంద్రం శనివారం ‘అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్’తో సీజేఐని సత్కరించింది. ఈ అవార్డును జనవరి 11న ప్రకటించారు.