×
Ad

Thailand : ఘోర ప్రమాదం.. కదులుతున్న రైలుపై జారిపడిన క్రేన్.. 22మంది మృతి

Thailand : థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా.. మరో 30 మందికిపైగా గాయపడ్డారు.

Thailand

Thailand : థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా.. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న రైలుపై క్రేన్ పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ క్రేన్ అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో కింద ఉన్న పట్టాలపై నుంచి ప్రయాణికుల రైలు వెళ్తోంది. ఊడిపడిన క్రేన్ రైలుపై పడింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి.

కదులుతున్న రైలుపై క్రేన్ పడటంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలులో 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.