Hamas Document: అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి అనంతరం దాదాపు రెండు వందల మంది పౌరుల్ని హమాస్ యోధులు కిడ్నాప్ చేశారు. అయితే ఒక బాధితుడి వద్ద హమాస్ ఉగ్రవాదుల మాన్యువల్ దొరికింది. దీని ద్వారా హమాస్ యోధులు ప్రజలను ఎలా బందీలుగా తీసుకోవాలో, బందీలను ఎప్పుడు ఏమి చేయాలో అందులో రాసి ఉంది. వాస్తవానికి బంధీలపై హమాస్ యోధులు ఎంత కిరాతకంగా వ్యవహరిస్తారో, వారిని ఎంత ఉన్మాదంగా చంపుతారో అందులో ఉంది.
ఎనిమిది పేజీల మాన్యువల్లో హమాస్ యోధులు ఈ ప్రాంతంలో అరాచకాన్ని వ్యాప్తి చేయాలని కోరారు. బందీల్లో ఎవరైనా అడ్డంకి సృష్టించినా, బెదిరింపులు చేసినా వారిని చంపేయాలని మాన్యువల్లో రాసి ఉంది. అలాగే మాన్యువల్ ప్రకారం ఎవరినైనా ఒప్పించాలంటే.. వారికి కరెంటు షాక్లు ఇవ్వండి, పిల్లల చేతులు-కాళ్లు కట్టేయండి అని రాసి ఉంది. తమను తాము రక్షించుకునే పరిస్థితి వస్తే బంధీలను మానవ కవచంగా ఉపయోగించుకోవాలని రాశారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. ఈ మాన్యువల్ గత సంవత్సరానికి చెందినదని, చనిపోయిన హమాస్ ఫైటర్ నుంచి స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Assembly Elections 2023: ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, బీజేపీలకు ఒకేసారి పెద్ద షాక్ ఎదురైంది
ఈ మాన్యువల్ మొదటి పేజీలో.. ఇది రహస్య పత్రంగా పేర్కొన్నారు. దానిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని, ఆర్డర్ ఉంటే తప్ప దానిని వెంట తీసుకెళ్లడం నిషేధించించినట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తిని ఎక్కడ కత్తితో పొడిస్తే అత్యంత ప్రాణాంతకమైన గాయం అవుతుందో కూడా మాన్యువల్ చెబుతుందని వాషింగ్టన్ పోస్ట్ రాసింది. మెడ, వెన్నెముక, అండర్ ఆర్మ్స్పై కత్తిపోటు అత్యంత ప్రాణాంతక గాయమని మాన్యువల్ పేర్కొంది. హమాస్ రహస్య సైనిక విభాగం అల్-కస్సామ్ 15,000-40,000 సైన్యాన్ని పోరాటానికి రంగంలోకి దించిందని అంచనా. వీరిలో 1,200 మంది అక్టోబర్ 7 దాడిలో పాల్గొన్నారు.