గుడ్ న్యూస్.. అమెరికా ప్రొడక్ట్స్ పై ట్యాక్స్ తగ్గింపు.. ఇవన్నీ రేట్లు తగ్గుతాయ్..

ఇండియాపై పరస్పర టారిఫ్ లు కచ్చితంగా వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మరికొన్ని అమెరికా ప్రొడక్ట్ లపై సుంకాలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది.

Trump and Modi

United States Imports: ఇండియాపై పరస్పర టారిఫ్ లు కచ్చితంగా వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మరికొన్ని అమెరికా ప్రొడక్ట్ లపై సుంకాలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. అయితే, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినా, లోకల్ తయారీ కంపెనీలకు ఎటువంటి నష్టం కలగని ప్రొడక్ట్ లపైనే సుంకాలు తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సుంకాలు తగ్గించినా లోకల్ కంపెనీలకు ఎటువంటి నష్టం ఉండదనుకునే ప్రొడక్ట్ లను గుర్తించే పనిలో విధ మినిస్ట్రీలు ఉన్నాయి.

భారత్, అమెరికా దేశాల మధ్య కురదబోయే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ (బీటీఏ)లో భాగంగా యూఎస్ నుంచి దిగుమతులను ఇండియా పెంచనుంది. ఇటీవల బీటీఏ చర్చల్లో ఇరుదేశాలుకూడా వ్యాపారాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లుకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య జరుగుతున్న వ్యాపారంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. ఇందులోనూ తక్కువ వాల్యూమ్ లో జరిగే దిగుమతులపైనే ఎక్కువగా సుంకాలను తగ్గించాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే ఆటో మొబైల్, ఆటో కాంపోనెంట్స్ వంటి సెక్టార్లలోని కంపెనీలతో చర్చ జరుపుతోంది. మరోవైపు వ్యవసాయ రంగం నష్టపోకుండా చూసుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టనుంది.

 

ప్రస్తుతం ఇండియా నుంచి ఏడాదికి రూ.1.2లక్షల కోట్ల విలువైన వెహికల్ పార్టులు యూఎస్ కు ఎగుమతి అవుతున్నాయి. వీటిపై అమెరికా ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీని వేయడం లేదు. అదే ఇండియా చేసుకుంటున్న ఆటో పోర్టుల దిగమతులపై 5శాతం నుంచి 15శాతం వరకు డ్యూటీ పడుతోంది. బీటీఏ చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ అంశంపై చర్చించారు.

 

ఇప్పటికే యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ప్రొడక్ట్ లపై ప్రభుత్వం సుకాలను తగ్గించింది. ఈనెల 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బార్బన్ విస్కీపై వేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని 150శాతం నుంచి 100 శాతానికి తగ్గించింది. చేపల ఆహారం, స్ర్కాప్ మెటీరియల్స్, ఇథర్నెట్ స్విచ్ లు, మోటార్ సైకిల్ పై కూడా సుంకాలకు కోత పెట్టింది. మరోవైపు.. ఇండియా – అమెరికా మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం పెద్దగా జరగడం లేదు. ఈ సెగ్మెంట్ లో సుంకాలు తగ్గించినా ఇండియన్ కంపెనీలకు పెద్దగా నష్టం ఉండదని ఎనలిస్టులు భావిస్తున్నారు.