India-Pakistan conflict: పాకిస్థాన్ ఆర్మీ పరార్.. బాంబుల మోతతో దద్దరిల్లుతున్న పాక్‌లోని ప్రధాన నగరాలు.. దడపుట్టిస్తున్న బీఎల్ఏ.. క్వెట్టా నగరం స్వాధీనం..

ఒకపక్క భారత్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్ ఇస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ప్రజలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కోలుకోలేని దెబ్బతీస్తుంది.

India Pakistan War

India-Pakistan conflict: భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉగ్రమూకలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లపైకి వాటిని వదిలింది. అయితే, భారత్ పాకిస్థాన్ సైన్యం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

 

జమ్మూకశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం దాడులు చేస్తోంది. నియంత్రణ రేఖ వెంట గురువారం రాత్రి పాక్ కు చెందిన 50 డ్రోన్లను భారత్ ఆర్మీ కూల్చివేసింది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ ప్రాంతాల్లో వీటిని కూల్చివేసింది. ఎల్70 గన్స్, జడ్ యూ23 ఎంఎం, అధునాతన ఆయుధాలతో డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది.

 

పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రగంలోకి దిగింది. పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసింది. ఇస్లామాబాద్, సియాల్ కోట్, లాహోర్, కరాచీ, పెషావర్, బహవల్ పూర్ లో బాంబుల వర్షం కురిపిస్తోంది. భారత వాయుసేన దెబ్బకు పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఇంటి దగ్గరలో బాంబు పేలుడు సంభవించింది. పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ.. భారీ భద్రత నడుమ ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. సురక్షిత ప్రాంతంలోని ఓ బంకర్ లో పాక్ ప్రధాని దాక్కున్నట్లు ప్రచారం జరుగుతుంది.

పాకిస్తాన్‌లోని పెషావర్‌, లాహోర్‌, కరాచీలో భారత్‌ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తుంది. పాక్‌ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. కరాచీ పోర్టుపై భారత నేవీ అధికారులు దాడి చేశారు. పాక్‌కు చెందిన మూడు ఫైటర్‌ జెట్స్‌తో పాటు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేశారు.

 

బీఎల్ఏ ఆధీనంలోకి క్వెట్టా నగరం..?
ఒకపక్క భారత్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్ ఇస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ప్రజలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కోలుకోలేని దెబ్బతీస్తుంది. కొద్దిరోజులుగా పాకిస్థాన్ ఆర్మీపై బాంబులు వర్షం కురిపిస్తూ హతం చేస్తున్న బీఎల్ఏ.. తాజాగా.. పాకిస్థాన్ లోని మొత్తం ఆరు స్థావరాలలో దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. క్వెట్టా, హజరే నగరాలలో కూడా దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. బలూచిస్తాన్‌లో మూడింట ఒక వంతును స్వాధీనం చేసుకున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. స్థానిక కథనాల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ భూభాగాలకు ఆనుకుని ఉన్న పాకిస్తాన్ పోస్టులను వదిలి పాకిస్థాన్ సైన్యం పారిపోయిందని బీఎల్‌ఏ తెలిపింది. అయితే, క్వెట్టా నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒకవైపు భారత్ ఆర్మీ, మరోవైపు బీఎల్ఏ దాడులతో పాకిస్థాన్ ఆర్మీ వణికిపోతుంది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ లోని పలువురు ప్రముఖులు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు సమాచారం.