జాక్ పాట్ కొట్టిన భారతీయుడు.. లాటరీలో రూ.24కోట్లు గెలిచాడు

ఓ భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు. లాటరీలో ఏకంగా రూ.24 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

indian wins rs 24 crore in uae lottery: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలీదు. కానీ, ఒక్కసారి అదృష్టం వరించిందంటే చాలు.. ఓవర్ నైట్ లో జీవితాలే మారిపోతాయి. అష్ట దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడైపోతాడు. సామాన్యుడు కూడా కరోడ్ పతి అయిపోతాడు. తాజాగా ఓ ప్రవాస భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు. లాటరీలో ఏకంగా రూ.24 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

లాటరీలో రూ.24 కోట్ల ప్రైజ్ మనీ:
గల్ఫ్ దేశాల్లో నిర్వహించే లాటరీల్లో అనేకమంది భారతీయులు కోట్లు గెలుచుకోవడం తెలిసిందే. తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతానికి చెందిన శివమూర్తి కృష్ణప్ప ఏకంగా రూ.24 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకున్నాడు. శివమూర్తి కృష్ణప్ప వృత్తిరీత్యా మెకానికల్ ఇంజినీర్. 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్నాడు. ఇటీవల కృష్ణప్ప కొనుగోలు చేసిన లాటరీ (నెంబరు 202511) టికెట్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మొత్తం 12 మిలియన్ల దిర్హమ్‌ల (భారత కరెన్సీలో రూ.24 కోట్లు)ను లాటరీలో సొంతం చేసుకున్నాడు. ఫిబ్రవరి 17న డ్రా తీశారు.

మూడేళ్లుగా లాటరీ టికెట్ కొనుగోలు:
లాటరీ నిర్వాహకులు శివమూర్తికి ఫోన్ చేసి విజేతగా నిలిచినట్టు చెప్పారు. దీంతో కృష్ణప్ప ఆనందానికి అవధులు లేవు. ఇంత భారీ మొత్తం గెలిచానంటే నమ్మశక్యంగా లేదన్నాడు. మూడేళ్లుగా ప్రతి నెల లాటరీలు కొంటుంటే, ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని కృష్ణప్ప పట్టరాని సంతోషంతో చెప్పాడు. కాగా, ఈసారి ఒకేసారి రెండు టికెట్లు కొనేందుకు నిర్వాహకులు అనుమతించడంతో తన అదృష్టం పండిందని తెలిపాడు. ఈ డబ్బుతో సొంతూరులో ఓ ఇల్లు కట్టిస్తానన్నాడు. మిగతా డబ్బు పిల్లల చదువులు, వారి భవిష్యత్ కోసం దాచుకుంటానని తెలిపాడు.

గతంలో స్నేహితులతో కలిసి టిక్కెట్లు కొనుగోలు చేసిన కృష్ణప్ప.. ఏడాది నుంచి విడిగా కొంటున్నాడు. ఈ సారి నిర్వాహాకులు ప్రత్యేక ఆఫర్ ఇవ్వడంతో రెండు టిక్కెట్లు కొనుగోలు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు