×
Ad

Khamenei: కర్నాటకలోని ఆ గ్రామానికి ఖమేనీ పేరు.. ఎందుకు పెట్టారు? ఖమేనీతో ఆ ఊరి ప్రజలకున్న అనుబంధం ఏంటి?

గ్రామస్తుల ప్రకారం 1986లో అలీ ఖమేనీ అలీపురాను సందర్శించారు. ఆ సందర్శన తర్వాత ఈ గ్రామం, ఇరాన్ మధ్య బంధం గణనీయంగా బలపడిందని వారు చెప్పారు.

  • Published On : March 1, 2026 / 07:47 PM IST

Khamenei Representative Image (Image Credit To Original Source)

  • కర్నాటక రాష్ట్రంలోని అలీపురా గ్రామంలో విషాదం
  • ఖమేనీ మృతికి మూడు రోజులు సంతాప దినాలు
  • 1986లో అలీపురాను సందర్శించిన ఖమేనీ
  • అలీపురా షియాల ఆధిపత్య గ్రామం

Khamenei: భారత దేశంలోని కర్నాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆ గ్రామానికి ఖమేనీ పేరు ఎందుకు పెట్టారు? మన దేశంలోని ఆ గ్రామానికి, ఖమేనీకి ఏంటి సంబంధం? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

దాదాపు 40 సంవత్సరాల క్రితం, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ కర్ణాటకలోని అలీపురాను సందర్శించారు. ఇది ఆ గ్రామం, ఇరాన్ మధ్య బంధం ఏర్పడేందుకు దారితీసింది. మార్చి 1న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నాయకుడు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో షియా ఆధిపత్య ప్రాంత వాసులు ఖమేనీ మరణం పట్ల దుఃఖిస్తున్నారు. 1980లలో అలీపురాను సందర్శించిన ఇరానియన్ నాయకుడి మరణం పట్ల కర్ణాటకలోని అలీపురా సంతాపం వ్యక్తం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించిన నేపథ్యంలో అలీపురా గ్రామంలో మూడు రోజుల సంతాప దినాలు పాటిస్తున్నారు. 1986లో షియాల ఆధిపత్య గ్రామం అలీపురాను ఖమేనీ సందర్శించారు. ఈ పర్యటన ఇరాన్, అలీపురా గ్రామం మధ్య సంబంధాలను బలోపేతం చేసింది.

కర్నాటక రాజధాని బెంగళూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్లాపూర్ జిల్లాలోని గ్రామంలో విషాదం అలుముకుంది. ఖమేనీ మృతికి సంతాపం తెలుపుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన సందర్భంగా చాలామంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆ గ్రామంలో ఆయన పేరు మీద ఒక ఆసుపత్రి కూడా ఉంది. అలీపురాలోని 30వేల మంది నివాసితులలో ఎక్కువ మంది షియాలు.

అలీపురాలో మూడు రోజుల సంతాపం..
షియా సుప్రీం నాయకుడికి నివాళిగా గ్రామస్తులు మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. గ్రామస్తులు మౌనం పాటించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఖమేనీ మృతికి సంతాపంగా వేడుకలు, ప్రజా కార్యక్రమాలను సైతం నిలిపివేశారు.

1986లో అలీపురాను సందర్శించిన ఖమేనీ..

గ్రామస్తుల ప్రకారం.. ఆహ్వానం మేరకు 1986లో అలీ ఖమేనీ అలీపురాను సందర్శించారు. ఆ సందర్శన తర్వాత ఈ గ్రామం, ఇరాన్ మధ్య బంధం గణనీయంగా బలపడిందని వారు చెప్పారు. తర్వాత ఖమేనీ పేరు మీద గ్రామంలో ఒక ఆసుపత్రి నిర్మించారు. ఇది ఖమేనీ పట్ల వారికున్న గౌరవాన్ని సూచిస్తుంది. అలీపురాలోని అనేక కుటుంబాలు ఇరాన్‌తో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. కొంతమంది గ్రామస్తులు ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇరాన్ లో స్థిరపడ్డారు.

ఖమేనీ మరణ వార్త గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అలీపురా అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఖమేనీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడానికి షియా మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఇలా జరిగి ఉండకూడదు అంటూ బోరున విలపించారు. ఖమేనీ హత్యను ఖండిస్తూ నల్ల దుస్తుల్లో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఖమేనీ హత్యను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. చేతిలో ఖమేనీ ఫోటోలతో నినాదాలు చేశారు.