Peru Nazca lines : పెరూలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పెరులో ఎడారిలో పర్యాటక స్థలాన్ని సందర్శించటానికి వెళ్లుతున్న విమానం నాజ్కాలోలో టేకాఫ్ అయిన కొద్దిసేటికే విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానం ప్రమాదం గురించి శుక్రవారం (ఫిబ్రవరి 4,2022) పెరు రవాణా,కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్, కోఫైలట్ ఉన్నట్లు తెలిపారు. పర్యాటకుల్లో ముగ్గురు డచ్ టూరిస్టులు, ఇద్దరు చిలీకి చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.
పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా..నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో సెన్నా 207 వివామంన కూలిపోయింది. ఆ విమానం ఏరో శాంటోస్ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు.
పెరూలో నాజ్కా లైన్లు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 1,500-2,000 సంవత్సరాల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన ఊహాత్మక బొమ్మలు, జీవులు, మొక్కల చిత్రాలే నాజ్కా లైన్లు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
ఇక్కడికి విదేశీ పర్యాటకుల కోసం మారియా రీచే ఎయిర్ ఫీల్డ్ నుంచి ప్రతిరోజు డజన్ల కొద్ది విమానాలను నడుపుతారు. 2010, అక్టోబర్లో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు బ్రిటిష్ పర్యాటకులు, ఇద్దరు పెరూవియన్ విమాన సిబ్బంది మరణించారు.