మైనారిటీల అణచివేతకు నిర్బంధ కేంద్రాలు పెంచుతున్న చైనా

చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు రెడీ చేసింది జిన్ పింగ్ ప్రభుత్వం. జిన్జియాంగ్​ ప్రాంతంలోని మైనారిటీలైన ఉయ్ ​గర్ ముస్లింల అణిచివేతకు… చైనా ప్రభుత్వం 380 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విషయాలను ఆస్ట్రేలియాకు చెందిన ఓసంస్థ తమ నివేదికలో వెల్లడించింది.

2017 నుంచి కొత్త వాటిని నిర్మించటం, ఉన్నవాటిని విస్తరించటం వంటి విస్తృత చర్యలు చైనా చేపట్టినట్లు ఆస్ట్రేలియా స్ట్రాటజిక్​ పాలసీ ఇన్​స్టిట్యూట్​(ఏఎస్​పీఐ)..ద జిన్జియాంగ్​ డేటా ప్రాజెక్ట్​ పేరుతో రూపొందించిన రిపోర్ట్ లో తెలిపింది.


కాగా, ఇటీవల జిన్జియాంగ్​ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మైనారిటీలను నిర్బంధించటంపై.. అంతర్జాతీయ సమాజం నుంచి చైనా ఆరోపణలు ఎదుర్కొంటోం. చైనాను ప్రపంచ దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఉయ్​గర్లపై మతపరమైన, సాంస్కృతిక దాడులు సహా వారి నమ్మకాలను నిషేధించటం, వారిపై నిఘా, మహిళలకు బలవంతపు గర్భవిచ్ఛిత్తి వంటి చర్యలను పలు దేశాలు తప్పుపడుతున్నాయి.


అయితే, ఉయ్​ గర్​ ముస్లింల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను సమర్థించుకున్న చైనా.. వాటి ద్వారా 2014 నుంచి సగటున 1.3 మిలియన్ల మంది తిరిగి విద్యాభ్యాసం చేసినట్లు తెలిపింది.శిబిరాలను వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా పేర్కొన్న చైనా.. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ఈ ప్రయత్నాలు అవసరమని తెలిపింది.