ఇజ్రాయిల్ స్పేస్ క్రాఫ్ట్ తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టబోతుండగా.. అంతరిక్షంలో తన మొదటి సెల్ఫీ ఫోటోను తీసి భూమికి పంపింది. భూమికి దాదాపు 20 వేల మైళ్ల (37 వేల కిలోమీటర్లు) దూరం నుంచి ఈ అద్భుతమైన ఫొటోను తీసిన స్పేస్ క్రాఫ్ట్ దానిని భూమికి పంపగా అది చాలా అందగా కనిపిస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ తీసిన సెల్ఫీలో రోబోటిక్ లాండర్తో పాటు వెనుకభాగంలో దగదగా వెలుగుతున్న భూమి స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే
స్పేస్క్రాఫ్ట్ అంతరిక్షంలో తీసిన ఈ సెల్ఫీలో భూమిపై ఆస్ట్రేలియా భూభాగం స్పష్టం కనిపిస్తుండగా మిషన్ బృంద సభ్యులు ఇజ్రాయిల్ టు మూన్ అనే ట్విట్టర్ పేజ్ ద్వారా ఆ ఫొటోను పోస్ట్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ తీసి పంపిన ఫొటోలో స్పేస్క్రాఫ్ట్పై ఇజ్రాయెల్ జాతీయ పతాకంతోపాటు.. ‘చిన్నదేశం.. పెద్ద కలలు’(Small Country, Big Dreams) అని రాసి ఉన్నమ సందేశం కూడా కనిపిస్తోంది.
At a distance of 37,600 km from Earth, #Beresheet’s selfie camera took a picture of #Earth. Australia can be clearly seen! This photo was taken during a slow spin of the #spacecraft & for the first time see the #Israeli flag ?? & text, “am yisrael chai.” #IsraelToTheMoon #SpaceIL pic.twitter.com/ELFZsaShXg
— Israel To The Moon (@TeamSpaceIL) March 5, 2019
ఇజ్రాయెల్ తన తొలి మూన్ లాండర్ను ఫ్లోరిడాలోని కేఫ్ కానవెరాల్ నుంచి రెండు వారాల క్రితం విజయవంతంగా ప్రయోగించింది. ఏప్రిల్ 11న చంద్రునిపై ఈ స్పేస్ క్రాఫ్ట్ దిగనుంది. 585 కిలోల బరువున్న ఈ స్పేస్క్రాఫ్ట్ను స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించారు.
ఇప్పటివరకూ రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్క్రాఫ్టులు మాత్రమే 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై దిగాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఇజ్రాయిల్ కూడా చేరనుంది. అయితే ఇండియా కూడా చంద్రయాన్-2 ద్వారా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. అలాగే జపాన్ కూడా Small Lunar Lander(SLIM) అనే స్పేస్ క్రాఫ్ట్ ను 2021లో ప్రయోగించాలని సిద్ధం అవుతుంది.
Also Read : దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు