Sri Lanka Cricis : ఉల్లి,టమోటా కిలో 200 పైనే.. ఎక్కడంటే……
శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఏర్పడిన సంక్షోభంతో కూరగాయలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
- chvmurthy
- Published On : July 12, 2022 / 06:17 PM IST
Sri Lanka Economic Crisis
Sri lanka Economic Crisis : శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఏర్పడిన సంక్షోభంతో కూరగాయలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని రాజకీయ, ఆర్ధిక సంక్షోభాన్ని ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కోంటోంది. సామాన్యుడి జీవనం భారంగా మారింది. కూరగాయల ధరలు రెట్టింపు కాగా… గతేడాది బియ్యం ధరతో పోలిస్తే కిలోకు 100 రూపాయలు పెరిగింది. ఏడాది క్రితం కిలో బియ్యం రూ.145 కాగా ఇప్పుడది రూ. 220కి చేరుకుంది.
వెజిటబుల్ మార్కెట్ లో క్యారెట్ కిలో రూ.490కి అమ్ముతున్నారు. కిలో ఉల్లిని శ్రీలంక రూపాయల్లో 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు రూ.220కి విక్రయిస్తున్నారు. పావుకిలో వెల్లుల్లిని శ్రీలంక రూ.160కి విక్రయిస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో శ్రీలంకలో ద్రవ్యోల్బణం ఎగబాకింది. ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు, కరెన్సీ స్ధిరీకరణకు శ్రీలంక కేంద్ర బ్యాంక్ ఏప్రిల్లో వడ్డీ రేట్లను పెంచినా ఆశించిన ఫలితాలు చేకూరలేదు. ఇంధనం, ఎరువులు, ఆహరం, మందుల దిగుమతులకు అవసరమైన విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత కూడా లంక పరిస్ధితిని మరింత దిగజార్చుతోంది. కరోనా మహమ్మారితో టూరిజం ఆధారిత ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కావడం లంక సంక్షోభానికి దారితీసింది.
కోవిడ్-19 పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయటం….మరోవైపు విదేశాల్లో పనిచేసే లంకేయులు పంపే నిధులు తగ్గిపోవడం, ప్రభుత్వ రుణాలు పేరుకు పోవడం పరిస్ధితి మరింత దిగజారింది. ఇక ఇంధన ధరల పెంపు, రసాయన ఎరువుల దిగుమతిపై నిషేధంతో వ్యవసాయ రంగం కుదేలైంది. దేశంలో ద్రవ్యోల్బణం కనివినీ ఎరుగని స్ధాయిలో పెరగటంతో 70 శాతం మంది లంకేయులు ఇప్పుడు ఆహార వినిమయాన్ని తగ్గించారని యూనిసెఫ్ పేర్కొంది. దేశంలో ఇంధన కొరత కూడా తీవ్రంగా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో 1990 అత్యవసర అంబులెన్స్ సేవలను కూడా నిలిపివేశారు. 1990 అంబులెన్స్ సర్వీస్ నంబర్కు కాల్ చేయవద్దని సూవా సేరియా అంబులెన్స్ సర్వీసు ప్రజలను కోరింది.
ప్రస్తుతం 3,700 మెట్రిక్ టన్నులతో నిండిన ఒక సరుకునౌక దేశానికి చేరుకోగా, 3,740 మెట్రిక్ టన్నులలో మరొక నౌక వచ్చే సోమవారం చేరుకోవాల్సి ఉంది. 3,200 మెట్రిక్ టన్నుల గ్యాస్తో కూడిన మరో సరుకు నౌక శుక్రవారం ద్వీప దేశానికి చేరుకోనుంది.ముఖ్యంగా అధిక ఇంధన ధరల కారణంగా శ్రీలంక ఎక్కువగా ఖర్చుతో కూడిన ద్రవ్యోల్బణంతో వ్యవహరిస్తోంది. జులైలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. 22 మిలియన్ల మంది జనాభా ఉన్న శ్రీలంక తీవ్రమైన విదేశీ మారకద్రవ్య కొరతతో విలవిలలాడుతోంది. ఇంధనం, ఎరువులు, ఆహారం మరియు ఔషధాలు అవసరమైన దిగుమతుల కోసం డబ్బులు చెల్లించడానికి దేశం కష్టపడుతోంది.
Also Read : Rana Daggubati : కేసు విషయంలో కోర్టుకు హాజరైన హీరో దగ్గుబాటి రానా
