ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం 7.0తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(USGS) తెలిపింది.
ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం 7.0తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(USGS) తెలిపింది. గతేడాది ఇండోనేషియాలో భూకంపంతో కూడిన సునామీ వచ్చిన సులవేసి ద్వీపానికి తూర్పు తీర ప్రాంతంలో 17కిలోమీటర్ల తోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు USGS తెలిపింది.
సునామీ హెచ్చరికలు జారీ అయినట్లు తెలిపింది.ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గతేడాది సులవేసి ద్వీపంలోని పాలులో భూకంపంతో కూడిన సునామీ కారణంగా 4,300మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Read Also : వాయిస్ సెర్చ్ చేశారా.. మీ గుట్టు అమెజాన్ చేతిలో ఉన్నట్లే