Sushila Karki
Sushila Karki: నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దానికి నాయకత్వం వహించేందుకు ఆ దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీ(73)ని జెన్ జడ్ గ్రూప్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం జెన్ జడ్ నేతలు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సుశీల కార్కీ పేరు ఖరారు చేశారు.
అలాగే, జెన్ జడ్ నేతలు కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షా, మాజీ విద్యుత్ బోర్డు అధికారి కుల్మాన్ ఘిసింగ్ పేర్లను కూడా పరిశీలించారు.
విద్యార్థుల నిరసనల మధ్య మంగళవారం ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలి రాజీనామా చేయడంతో నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి దిగజారింది. నిరసనల కారణంగా చట్టం, శాంతి భద్రతల బాధ్యతలను నేపాల్ ఆర్మీ స్వీకరించి బుధవారం దేశవ్యాప్తంగా ఆంక్షలు, కర్ఫ్యూ విధించింది. జెన్ జడ్ నిరసనకారులు కార్కీని తాత్కాలిక ప్రధానిగా ఉండాలని కోరుతున్నారని సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు.
సుశీల కార్కీ ఎవరు?
“మోదీజీకి నా నమస్కారాలు. మోదీజీపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ప్రభుత్వాల మధ్య సంబంధాలనేవి వేరే విషయం. కానీ, నేపాల్ ప్రజలు, భారత్ ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలు ఉన్నాయి. మా బంధువులు, మా పరిచయస్తులు అనేకమంది అక్కడ ఉన్నారు. భారత నేతలను చూసి చాలా ప్రభావితం అయ్యాను. వారిని మన సోదరులు, సోదరీమణులుగా పరిగణిస్తాము” అని చెప్పారు.
భారత్లో చదువుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె పలు విషయాలు తెలిపారు. “నా అధ్యాపకులు, స్నేహితులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను. గంగా నది గుర్తుంది. వేసవిలో రాత్రుళ్లు మేము టెర్రస్పై నిద్రపోయేవాళ్లం” అని తెలిపారు.