TANA: ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, వెస్ట్ చెస్టర్ నగరంలో శనివారం మార్చి 11న మిడ్ అట్లాంటిక్ తానా టీం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించింది. 600 మందికి పైగా ఫిలడెల్ఫియా, సౌత్ జెర్సీ పరిధిలో నివాసముంటున్న ఎందరో ప్రవాస తెలుగింటి ఆడపడుచులు, ఈ వేడుకకు హాజరై ఆటపాటలతో, నృత్య ప్రదర్శనలతో, ఫ్యాషన్ షోలతో ఉత్యాహంగా సందడి చేశారు. మగువలు, చిచ్చర పిడుగులు (పిల్లలు) ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెలవు దినాన్ని సంభ్రమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా వేడుక కనులవిందుగా నిర్వహించారని అక్కడకు విచ్చేసిన మహిళలునిర్వాహకులతో అన్నారు. రస్నా బేబీ, సింహాద్రి ఫేమ్ చిత్ర కథానాయిక అంకిత ఝవేరి రాకతో వేడుక మరింత శోభాయమానంగా మారింది.
మహిళలు మీకు జోహార్లు
ఫిలడెల్ఫియాలో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు. తానా 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ, క్రీడ, ఆర్ధిక, అంతరిక్ష, టెక్నాలజీ వంటి పలు రంగాలలో మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. రంగం ఏదైనా పురుషులతో సమానంగా ఉన్నత శిఖరాలు అందుకుంటున్నారు అని ప్రసంగిస్తూ “మహిళలు మీకు జోహార్లు”అని వందనం చేసారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలు. ఒక తల్లిగా, తోబుట్టువుగా, బిడ్డగా, భార్యగా రకరకాల అవతారాలలో మగవారి జీవితానికి ఒక అర్ధం పరమార్ధం తెచ్చే మహిళామూర్తులందరికి పాదాభివందనం అని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో తానా విమెన్ కోఆర్డినేటర్ ఉమా కటికి ప్రసంగం మహిళలందరిలోను స్ఫూర్తినింపేలాగా సాగింది. తాను ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్గ అందించిన సేవలు, గృహహింసకు లోనైనా మహిళలకు, వరకట్న వేధింపులకు గురైన మగువలకు తాను ఆసరాగా నిలిచిన సందర్భాలను నెమరేసుకున్నారు. వైద్య రంగంలో అత్యున్నత సేవలందిస్తునందుకు గాను ప్రముఖ వైద్యురాలు డా. శైలజ ముసునూరు, డా. ప్రమీల మోటుపల్లి, డాక్టర్ ప్రశాంతి బొబ్బా, స్వర్ణ జెవెలర్స్ శ్రీమతి అలివేలు రాచమడుగు మరియు మిస్ ఇండియా డెలావేర్ శ్వేతా కొమ్మోజిని ఘనంగా సత్కరించారు.
ధీర వనితలు
మిడ్ అట్లాంటిక్ మహిళా కోఆర్డినేటర్ సరోజ పావులూరి, భవాని క్రొత్తపల్లి, లక్ష్మి ముద్దన, మనీషా మేక, రాజేశ్వరి కొడాలి, భవాని మామిడి, దీప్తి కొక, రమ్య పావులూరి, లక్ష్మి కసుకుర్తి, మైత్రి నడింపల్లి, ఇందు పొట్లూరి, రూప ముద్దన, హిమబిందు కోడూరు, రాణి తుమ్మల, స్మిత తదితరులు కార్యక్రమ విజయానికి కృషి చేశారు.
Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ఉపాసనతో కలిసి రామ్ చరణ్ సందడి..
ఈ కార్యక్రమంలో తానా 23వ మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, మిడ్ అట్లాంటిక్ ప్రాంత ప్రతినిధి సునీల్ కోగంటి, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, తానా టీం స్క్వేర్ కో చైర్ కిరణ్ కొత్తపల్లి, రంజిత్ మామిడి, చలం పావులూరి, ఫణి కంతేటి, ప్రసాద్ క్రొత్తపల్లి, విశ్వనాథ్ కోగంటి, రామ ముద్దాన, రవి తేజ ముత్తు, కృష్ణ నందమూరి, కోటి బాబు యాగంటి, సాంబయ్య కోటపాటి, గోపి వాగ్వాల, సతీష్ మేక, సతీష్ చుండ్రు, వెంకట్ సింగు, మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, హర్రీస్ బర్గ్ తానా టీం, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.