రాష్ట్రంలో ఎమ్ సెట్ ప్రవేశ పరీక్షను జూన్ 6 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శనివారం నాడు ఆమె ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, కాలేజ్ ఎడ్యుకేషన్ కమీషనర్ నవీన్ మిట్టల్.. ఇతర అధికారులతో సమావేశమై వివిధ ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చించి షెడ్యూల్ను విడుదల చేశారు.
కోవిడ్ 19 నిబంధనలకు లోబడి యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్
జులై 1న పాలిసెట్
జులై 4న ఈసెట్
జులై 6వ తేదీ నుంచి 9 వరకు ఎంసెట్
జులై 10న లాసెట్, లా పీజీ సెట్
జులై 13న ఐసెట్
జులై 15న ఎడ్సెట్
Read: జూన్ 8 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. షెడ్యూల్ ఇదిగో