Sarkaru Vaari Paata: సూపర్స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. ఇటీవలే దుబాయ్లో షూటింగ్ ప్రారంభమైంది. మహేష్ పక్కన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
గురువారం ‘ఐన్ 5దుబాయ్’ అనే బిల్డింగ్ ఫోటోలు పోస్ట్ చేసిన మహేష్.. శుక్రవారం షార్జాకు సమీపంలో ఉన్న ఎడారి అందాలను షేర్ చేశారు. ‘‘షార్జాకు సమీపంలో ఉన్న మ్లైహా (Mleiha)లో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ చేస్తుండడం అద్భుతమైన అనుభూతి కలిగిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు, అద్భుతమైన లొకేషన్లు బాగా నచ్చాయి. ఇక్కడి ఆతిథ్యం, ప్రేమ గొప్పగా ఉన్నాయి’’ అని ట్వీట్ చేశారు సూపర్స్టార్.
2022 సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవలే ప్రకటించారు. మహేష్ కెరీర్లో మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. సంగీతం : థమన్, కెమెరా : మది, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : ఏ ఎస్ ప్రకాష్, నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట.
Filming for #SarkaruVaariPaata at Sharjah’s Mleiha (@discovermleiha) was truly a unique experience! The stories, amazing recreational activities, and stunning landscapes will stay my favorite for a long time to come! Appreciate the warmth and hospitality ?? pic.twitter.com/4YxH25T1AG
— Mahesh Babu (@urstrulyMahesh) February 5, 2021