పోలీసుల మీద ప్రేమతోనే ‘ధృవ’ చేశాను.. రామ్ చరణ్..

Ram Charan: సైబరాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రోగ్రాంకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు ‘ఆచార్య’ షూటింగులో కూడా పాల్గొంటున్న చరణ్ స్వామిమాలలో దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌కి విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గెలిచిన సినిమాల కన్నా గెలవని సినిమాల నుంచే ఎక్కువగా నేర్చుకున్నా. పోలీసు కథ చెప్పగానే ‘ధృవ’ చిత్రం చేశాను. కోవిడ్ టైం లో పోలీసులు చాలా కష్టపడ్డారు’’ అన్నారు.

చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన చరణ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కలయికలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ లో చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్రలో నటిస్తున్నారు. చరణ్ వాయిస్ ఓవర్ చెప్పిన ‘ఆచార్య’ టీజర్ ఇటీవల విడుదల చేశారు. ప్రస్తుతం టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు