SaiDharamTej : వార్డ్కు సాయిధరమ్ తేజ్ షిఫ్ట్.. హెల్త్ బులెటిన్ రిలీజ్
సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నట్టు అపోలో డాక్టర్లు చెప్పారు. సాయి ధరమ్ తేజ్ను ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు షిఫ్ట్ చేశారు.
- Paramesh V
- Published On : September 21, 2021 / 06:18 PM IST
Sai Dharam Tej
SaiDharamTej: హైదరాబాద్ మాదాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయంటున్నారు సన్నిహితులు. సాయిధరమ్ తేజ్ హెల్త్ కు సంబంధించి అపోలో హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ తాజాగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.
Sai Dharam Tej : యాక్సిడెంట్ కేసు.. రూ.లక్ష ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ
సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నట్టు అపోలో డాక్టర్లు చెప్పారు. సాయి ధరమ్ తేజ్ను ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు చెప్పారు.
తేజ్ ఆరోగ్య పరిస్తితిని డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
Medicover : గోల్డెన్ అవర్లో తీసుకొచ్చారు…సాయి ధరమ్ తేజ్కు ప్రమాదం తప్పింది
