భారతదేశంలోకి మిడదల దండు ప్రవేశించింది. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రైతులను కొన్ని వారాలుగా మిడతల దండు వెంటాడుతోంది. పంటలను నాశనం చేసే మిడత కుటుంబం నుంచి వచ్చిన కీటకాలు ఈ వారం ప్రారంభంలో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించాయి. దాదాపు మూడు దశాబ్దాలలో మిడతలు దాడులతో పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. మిడతల కారణంగా భారతదేశ ఆహార భద్రతను ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీలో మాటు వేసిన మిడదల దండును మట్టుబెట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది రసాయనాలతో సిద్ధంగా ఉంచింది.
మిడుతలు జైపూర్ నివాస ప్రాంతంలోకి ప్రవేశించాయి. అక్కడి పచ్చని ప్రాంతాలను పీల్చి పిప్పి చేసేలా కనిపిస్తోంది. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. మిడతల దాడి చేస్తే భారీ స్థాయిలో పంటలకు నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది. సాధారణంగా మిడతల దండు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. మిడతలు ఒక్కసారిగా పచ్చగా ఉన్న పంటలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తాయి. మిడతల దండు ఎలా జీవిస్తాయి.. వాటి కారణంగా పంటలను ఎంత స్థాయిలో దెబ్బతింటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. మిడుతలు.. సాధారణ మిడతలాగే కనిపిస్తాయి. వీటి వెనుక రెండు పెద్ద కాళ్ళు ఉంటాయి. మిడత మాదిరిగానే పైకి ఎగిరి దూకగలవు. సాధారణంగా ఏకాంత జీవితాన్ని గడుపుతాయి, కానీ, ఒకేసారి భారీ సమూహంగా దండుగా కలిసి వస్తాయి. కొన్ని రోజులలోనే వృక్షసంపదను భారీగా నాశనం చేస్తాయి.
2. మొక్కలను మాత్రమే తింటాయి. వర్షానికి ముందు పొడిబారిన పచ్చని భూమిలో కలిసిపోయేలా చేస్తాయి. దగ్గరకు వచ్చేసరికి, ఒక హార్మోన్ వాటిని మరింత మచ్చికగా చేస్తుంది. వర్షం పడినప్పుడు, అవి వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. శారీరక సామర్థ్యాలు మెరుగుపడి వాటి దశలోకి ప్రవేశిస్తాయి.
3. మిలియన్ల సమూహాలలో చాలా వేగంగా ఎగురుతాయి. ఒక రోజులో పదుల మైళ్ళు ప్రయాణిస్తాయి. విపరీతమైన ఓర్పు కలిగి ఉంటాయి. చాలా దూరం గాలిలోనే ప్రయాణించగలవు. భారీ దూరాలను కూడా ఇట్టే చుట్టి వచ్చేస్తాయి. భారీ పంట నష్టాన్ని చేయగలవు. చెకింగ్ చేయకపోతే, కొన్ని గంటల్లోనే పొలాలను ఖాళీ చేయగలవు. ప్రతి కీటకం తన బరువుకు తగినట్టుగా తినేయొచ్చు.
4. ఎడారి మిడుతలు తూర్పు ఆఫ్రికా సుడాన్లలో ఉద్భవించి సౌదీ అరేబియా, ఇరాన్ మీదుగా పాకిస్తాన్ భారతదేశాలకు తిరుగుతాయి. అప్పుడు పెద్ద సమూహం చిన్న సమూహాలుగా విరిగి దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది.
5. రాజస్థాన్ నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు ఎడారి మిడుతల సమూహాలు భారతదేశం గుండా వ్యాపించాయి, పంటలు, పచ్చిక బయళ్లను వేగంగా నాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం, 33 రాజస్థాన్ జిల్లాల్లో 16 మిడతల సమూహాల బారిన పడ్డాయి. రాష్ట్రంలోని ఖరీఫ్ పంట ప్రమాదంలో ఉంది.
6. ఎడారి మిడుతలు ఈ వారం ప్రారంభంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ నియోజకవర్గం బుధ్నిలోకి ప్రవేశించాయి. తెగుళ్ళు రాష్ట్రంలోని నీముచ్ జిల్లా గుండా ప్రవేశించాయి. తరువాత మాల్వా నిమార్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లి భోపాల్కు దగ్గరగా తిష్టవేశాయి.
7. ఎడారి మిడుతలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ బాధిత జిల్లాల గ్రామాల్లోని రైతులకు సలహా ఇచ్చింది. డ్రమ్స్ ద్వారా పెద్ద శబ్దాలు చేయడం, పాత్రలు కొట్టడం అరవడం ద్వారా కీటకాలను తరిమికొట్టవచ్చునని కోరారు.
8. మిడదల దండును వెంటనే నియంత్రించకపోతే మాత్రం సుమారు రూ.8,000 కోట్ల విలువైన మూంగ్ తృణధాన్యాల పంటను నాశనం చేయవచ్చని నిపుణులు హెచ్చరించారు.
9. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం.. ఎడారి మిడుత.. ప్రపంచంలోని అన్ని వలస తెగులు జాతులలో అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించింది. ప్రజల జీవనోపాధి, ఆహార భద్రత, పర్యావరణం, ఆర్థిక అభివృద్ధికి ముప్పు తెస్తుంది.
10. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మిడుత దాడుల అవకాశాలను మరింత పెంచుతుందని నిపుణులు అంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత వర్షాన్ని తగ్గిస్తుంది.